- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు ఆపకపోవడంపై ఆగ్రహం.. వెంబడించి డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పుతో దాడికి దిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విజయవాడ వెళ్లేందుకు పులిగడ్డ బ్రిడ్జి వద్ద సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు వేచి చూశారు...

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) అవనిగడ్డ(Avanigadda)లో ఆర్టీసీ డ్రైవర్(Rtc Driver)పై ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పుతో దాడికి దిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విజయవాడ వెళ్లేందుకు పులిగడ్డ బ్రిడ్జి వద్ద సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు వేచి చూశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఆపాల్సిందిగా ఓ మహిళా ప్రయాణికురాలు కోరారు. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళ వెంటనే ఆ బస్సును వెంబడించి ఎక్కారు. వెంటనే డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. బస్సు ఆపకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఆమె డ్రైవర్ను నిలదీసింది. ఆవేశంతో తన చెప్పుతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
Next Story






