ఆయన ఆశీస్సుల వల్లే మంత్రిగా ఉన్నా: మంత్రి రోజా

by Disha Web Desk 16 |
ఆయన ఆశీస్సుల వల్లే మంత్రిగా ఉన్నా: మంత్రి రోజా
X

దిశ, పాలకొల్లు: కార్తీక మాసం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వర స్వామని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయంలో స్వామికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉన్నానంటే క్షీరా రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల వల్లేనని చెప్పారు. మహిమాన్విత క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శనం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనన్నకు మరో 30 ఏళ్ళు ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కలగజేయాలని స్వామిని కోరుకున్నట్లు రోజా వెల్లడించారు.

Next Story