వారణాసిలో వార్ వన్ సైడే : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

by Shiva Kumar |
Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరో విడతలో భాగంగా జూన్ 1న వారణాసిలో జరిగే ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పోలయ్యే ఓట్లలో అత్యధిక శాతం శాతం మోడీకే పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వారణాసిలో ఎన్నికల ప్రచారంలో మంగళవారం బండి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్ టు డోర్ ప్రచారం చేశారు. పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. వారణాసిలో ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ అభిమానులేనని, వారంతా కచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. మోడీకి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే అత్యధిక పోలింగ్ నమోదు కావాలని పేర్కొన్నారు. సోనార్‌పుర‌లో మహిళా బృందంతో బండి సంజయ్ భేటీ సందర్భంగా కాశీలోని ప్రతి ఒక్క మహిళ మోడీకే ఓటు వేస్తారని బృందంలోని మహిళలు సంజయ్‌కు వివరించారు. అదే ధీమాతో కూర్చోకుండా ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మహిళలదేనని సంజయ్ వారికి సూచించారు. శ్రీరామ తారక ఆంధ్రా ఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వీవీ సుందరశాస్త్రితోనూ బండి భేటీ అయ్యారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీ, బీజేపీ నాయకులు గజానంద్ జోషి, మహేష్ బాబు, పాఠక్‌‌తో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed