టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

by Disha Web Desk 18 |
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు
X

దిశ ప్రతినిధి,విజయవాడ:సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు.ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులు పంపారు.టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు.

ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో జరిగిన ఎన్డీయే కూటమి సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయుసేన హెలికాఫ్టర్‌ను ఉపయోగించారంటూ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లేందుకు టెయిల్ నంబర్ 5236 గల ఐఏఎఫ్ హెలికాప్టర్‌ను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read More..

పార్టీకి పని చేయండి.. మీకు ప్రాధాన్యత కల్పిస్తాం.. ఆ వర్గానికి చంద్రబాబు హామీ

Next Story