పార్టీకి పని చేయండి.. మీకు ప్రాధాన్యత కల్పిస్తాం.. ఆ వర్గానికి చంద్రబాబు హామీ

by Disha Web Desk 3 |
పార్టీకి పని చేయండి.. మీకు ప్రాధాన్యత కల్పిస్తాం.. ఆ వర్గానికి చంద్రబాబు హామీ
X

దిశ, పుట్టపర్తి: తాజాగా మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వడ్డెర సంఘం నాయకులు మల్లెల జయరాం, వడ్డేవెంకట్, సిమెంట్ పోలన్న తదితరులు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వడ్డెర సంఘం నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డెర్లకు చట్టసభల్లో స్థానం కల్పించాలని.. జనాభా పరంగా అధిక శాతం ఉన్న తమకు రెండు ఎమ్యెల్యే, ఒక ఎంపీ స్థానం కేటాయించాలని తాము కోరినట్లు తెలిపారు.

అయితే తమ అభ్యర్ధనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని.. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, టికెట్ రాలేదని నిరాశపడవద్దని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవినీతి వైసీపీని ఇంటికి పంపేందుకు.. టీడీపీని గెలిపించేందుకు ప్రతిఒక్కరు పనిచేయాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.

కాగా ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ఉమ్మడిజిల్లా ఉపాధ్యక్షుడు పల్లెపు జయ చంద్రమోహన్, నాయకులు దలవాయి వెంకటనారాయణ, జరిపిటి కృష్ణమూర్తి, తన్నూరి ఆంజనేయులు, రమాదేవి, నాగార్జున, మల్లెల ఈశ్వర్, తిరుపాల్, తురక వీరస్వామి, మారెప్ప ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Read More..

అధికార పార్టీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే


Next Story

Most Viewed