Visakha: సీఎం జగన్‌ను ఇంటికి పంపించండి.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Visakha: సీఎం జగన్‌ను ఇంటికి పంపించండి.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. అమరావతి విషయంలో జగన్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. విశాఖ రైల్వే గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల పట్ల సీఎం జగన్ అన్యాయంగా వ్యవహరించారని మండిపడ్డారు. అమరావతి రైతులను మానసికంగా హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ నాలుగే పాలనలో అన్నీ విధ్వంసాలేనని విమర్శించారు. ప్రజా వేదిక, అన్న క్యాంటీన్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకానికి, అవినీతికి వైసీపీ ప్రభుత్వా కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు అవుతున్నా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలపైనా విష్ణుకుమార్ రాజు విమర్శలు కురిపించారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపు నిచ్చారు.

ఇవి కూడా చదవండి:

Yuvagalam: రైతులకు నారా లోకేశ్ మరో కీలక హామీ.. బద్వేల్ వేదికగా ప్రకటన

Next Story

Most Viewed