దువ్వాడలో ఫ్లాట్ ఫామ్, రైలు మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని మృతి

by Disha Web Desk 16 |
దువ్వాడలో ఫ్లాట్ ఫామ్, రైలు మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని మృతి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్, రైలు మధ్య ఇరుక్కుపోయిన యువతి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అన్నవరానికి చెందిన శశికళ (20) దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లే క్రమంలో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె దువ్వాడ వద్ద రైలు దిగే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయారు. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించారు. రైల్వే రెస్క్యూ సిబ్బంది గంటపాటు శ్రమించి బయటకు తీసి ఆమెను చికిత్స కోసం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. చదువుపై ఎంతో శ్రద్ధ చూపించే తమ కుమార్తె మృతి చెందడంతో కన్నీరుమున్నీరువుతున్నారు.

కార్లకు 3 ఏళ్లు, బైక్‌లకు ఐదేళ్ల పాటు బీమా.. ప్రతిపాదించిన ఐఆర్‌డీఏఐ!


Next Story