స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-26 09:13:44  IST  )

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది...

స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?
X

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం జిల్లా (Markapuram District)లో జరిగిన ఘోర ప్రమాదం(Fatal accident) బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం నేపథ్యంలో కీలక విషయం వెల్లడైంది. బస్సు కండీషన్‌పై అందులోని ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు. కండీషన్‌ సరిగా లేదని డ్రైవర్‌తో చెప్పారు. దీంతో బస్సు సిబ్బంది.. యర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపి మరమ్మతులు చేశారు. అనంతరం బయల్దేరిన కొంత సమయం తర్వాత మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ ఘోరం జరిగిపోయింది. బస్సు డ్రైవర్‌ను అధికారులు విచారిస్తే స్టీరింగ్‌ స్ట్రక్‌ అయిందని చెప్పినట్లు తెలిసింది.

మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

Next Story