Breaking: రూ.2 వేల నోట్ల రద్దుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Breaking: రూ.2 వేల నోట్ల రద్దుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రూ.2 వేల నోటును రద్దు చేయడాన్ని టీడీపీ అధినేత చద్రబాబు స్వాగతించారు. డిజిటర్ కరెన్సీ రిపోర్టు తానే ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజకీయ అవినీతి తగ్గాలంటే రూ.2 వేలు, రూ.5 వందల నోట్లను రద్దు చేయాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి దేశ సంపద దోచుకుంటున్నారని చంద్రబాబు సూచించారు. మనీలాండరింగ్ నియంత్రణ జరగాలని కోరుకున్నానని తెలిపారు.

కాగా భారతీయ రిజర్వు బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు(మే 19) నుంచి రూ.2 వేల నోటు జారీ నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ నోట్లను సర్క్యులేషన్‌లో ఉంచొద్దని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఎవరివద్దనైనా ఈ నోట్లు కలిగి ఉన్న ఉంటే మే 23 నుంచి అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్‌లలో మార్చుకోవచ్చని సూచించింది. సెప్టెంబర్ 30 వరకు ఎక్స్‌ఛేంజ్, డిపాజిట్లకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఒక రోజులో ఒక వ్యక్తి రూ.20 వేలు మాత్రమే నోట్లను మార్చుకోవడానికి వీలుంటుందని తెలిపింది.

ఎన్నికల ఏడాదిలో ఆర్బీఐ రూ.2 వేల నోట్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసిన తర్వాత 2016 నుంచి మార్కెట్లో చెలామణిలో ఉంది. ఈ నోటు చెలామణిపై మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ క్రమంలో 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బ్లాక్ మనీ విషయం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లను దాచిపెట్టుకున్న వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇవి కూడా చదవండి :

మళ్లీ చెలామణిలోకి 1000 నోటు?

రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన

Anakapalli: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన



Next Story