జగన్ పాలనపై టీడీపీ ఛార్జిషీట్..ప్రజావేదిక కూల్చడంతో మొదలై చేశిందేంటి అంటూ విమర్శలు

by Disha Web Desk 21 |
జగన్ పాలనపై టీడీపీ ఛార్జిషీట్..ప్రజావేదిక కూల్చడంతో మొదలై చేశిందేంటి అంటూ విమర్శలు
X

దిశ,వెబ్‌డెస్క్: జగన్ సర్కార్ పాలనను విమర్శిస్తూ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. నాలుగేళ్ల మోసకారి పాలనలో నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలే మిగిలాయని టీడీపీ నాయకులు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని, ప్రజలను ఏ విధంగా మోసం చేశారో తెలియజేస్తూ ఛార్జిషీట్‌‌ను విడుదల చేశారు. జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజా వేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వం పరిపాలన మొదలైందని, అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడ చూసిన విధ్వంసమేనని నక్కా ఆనందబాబు అన్నారు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కూలాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ సంక్షేమ పాలన అంతా బూటకమేనన్నారు. గతంలోని పథకాలకే పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో అన్నీ నేరాలే, ఘోరాలే అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దుయ్యబట్టారు. ప్రజలకు ఏం మేలు చేశారో.. చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read..

రైతులకు మాజీ సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్

Next Story

Most Viewed