అది మేనిఫెస్టో కాదు..రాజీనామా పత్రం..చంద్రబాబు సెటైర్స్

by Disha Web Desk 16 |
అది మేనిఫెస్టో కాదు..రాజీనామా పత్రం..చంద్రబాబు సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో కాదని.. రాజీనామా పత్రం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బటన్ అందరూ నొక్కుతారని, బటన్ నొక్కడానికి సీఎం కావాలా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని మండిపడ్డారు. కలెక్టరేట్లు, రైతు బజార్లు, ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారన్నారు. జగన్ హయాంలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..? అని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో కియా కంపెనీ తెచ్చామని చెప్పారు. అభివృద్ధిని నిలిపేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని వ్యాఖ్యానించారు. ఏపీకి రాజధాని ఏదో చెప్పగలారా..? చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఓడిపోయానని ముందుగా ఒప్పుకుని జగన్ పారిపోతున్నారని విమర్శించారు. అవకాశాలు ఉంటే.. ఆకాశమే హద్దుగా మనవాళ్లు ఎదుగుతారని చెప్పారు. జగన్ కు గులకరాయి తగలకపోయినా నాటకాలు ఆడారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్‌ను నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.



Next Story

Most Viewed