- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాగిడి గెలుపుతోనే... మల్కాజిగిరి సస్యశ్యామలం : మల్లారెడ్డి
దిశ, కీసర : బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని, కాంగ్రెస్ వచ్చిన 5 నెలల్లోనే 50 ఏళ్ల నాటి తిప్పలను చూపిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ లోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజు చేస్తే, కాంగ్రెస్ రైతులను అరిగోస పెడుతూ పంటలు ఎండిపోయే స్థితికి చేరుకుందని, రైతుగోస తగిలిన ఏ ప్రభుత్వాలు పొడుగెళ్ళలేదని, పెట్టుబడి సాయం లేక రైతులు సావుకారులను ఆశ్రయిస్తున్నారని, ఇదా కాంగ్రెస్ పాలిస్తున్న పాలన అంటూ దుయ్యబట్టారు. నీళ్ళులేక చెట్లు ఎండిపోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కౌకుట్ల అనంత్ రెడ్డి, కొమిరెల్లి అనితా సుధాకర్ రెడ్డి, అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, రేణుక జగన్మోహన్ రెడ్డి, గూడూరు సబితా ఆంజనేయులు గౌడ్, కొట్టె దివ్య దయాకర్, నాగారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తేల్ల శ్రీధర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు సాయినాథ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.