మహానాడులో తెలంగాణ ప్రస్తావన.. బీఆర్ఎస్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-28 12:41:22  IST  )

తనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

మహానాడులో తెలంగాణ ప్రస్తావన.. బీఆర్ఎస్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) తెలిపారు. కడప(Kadapa)లో జరుగుతున్న మహానాడు(Mahanadu)లో తెలంగాణ(Telangana)పై ప్రస్తావించారు. నదుల అనుసంధానం(River connection)తో తెలంగాణకూ లాభమేనని చెప్పారు. అక్కడ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే ఆ అంశంలో బీఆర్ఎస్(Brs) తప్పుడు ప్రచారం చేస్తోందని, అందులో నిజం లేదని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదన్నారు. హైదరాబాద్(Hyderabad) అభివృద్ధిలో తన పాత్ర చాలా కీలకమని గుర్తు చేశారు. నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) చివరి రాష్ట్రమని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read..

దిశ’ మహానాడు సంచిక చాలా బాగుంది.. CM చంద్రబాబు ప్రశంస

CM చంద్రబాబు చేతిలో ‘దిశ’ ప్రత్యేక సంచిక

Next Story