పవన్‌ను కలిసిన ప్రధాని.. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-10 12:32:57  IST  )

కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) శస్త్ర చికిత్స చేయించుకున్నారు. డాక్టర్ల సూచనలతో ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు....

పవన్‌ను కలిసిన ప్రధాని.. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) శస్త్ర చికిత్స చేయించుకున్నారు. డాక్టర్ల సూచనలతో ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ప్రధాని మోడీ పవన్ కల్యాణ్ ను పరామర్శించారు. హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగరానికి వచ్చిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లారు. పవన్‌ను కలిసి ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకుని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని పవన్ కల్యాణ్‌కు మోడీ తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి బయల్దేరి వెళ్లారు. అయితే పవన్ కల్యాణ్-మోడీ భేటీ చారిత్రాత్మకమని జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read More.. హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో ప్రధాని మోడీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Next Story