- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి జనసేన ఎన్నికల ప్రచారాన్ని పవన్ పిఠాపురం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ ఇంటికి పవన్ వెళ్లి.. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకు అశేష జనం ఘన స్వాగతం పలికారు. అలాగే తన ఇంటికి మొదటి సారి వచ్చిన జనసేనానికి.. వర్మ కుటుంబ సభ్యులు స్వాగతం పలికి.. అనంతరం సత్కరించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. వర్మ మాతృమూర్తి శ్రీమతి అలివేలు మంగ పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం.. వర్మ, శ్రీ సుజయ్ కృష్ణ రంగారావులను పవన్ కల్యాణ్ సత్కరించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలో యధావిథిగా పవన్ పాల్గొన్నారు.
Read More..
ఆ పని చెయ్యడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి.. చంద్రబాబు సంచలనం వ్యాఖ్యలు..