ఆ పని చెయ్యడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 3 |
ఆ పని చెయ్యడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రొద్దుటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల సీమలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైసీపీ కేవలం 2 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఇక తాను ఎన్నో సార్లు కడపకు వచ్చానన్నారు.

అలానే తాను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించినట్లు తెలిపారు. ఇక కడకు గండి కోట పూడ్చి ల్యాండ్ ఎక్యువషన్ చేసి పులివెందులకు నీళ్లు ఇచ్చిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. వైసీపీ కేవలం 5% పూర్తి చేసి ఆంద్రీనీవా నుండి కుప్పానికి నీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇక కృష్ణ జలాలను రాయలసీమకు తేవాలనేది ఎన్టీఆర్ కల అని పేర్కొన్నారు.

అయితే పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను రాయసీమకు తెలవనేది తన కలని.. అందుకే పోలవరం ప్రాజెక్ట్ ను 72% పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే గత ఐదేళ్లలో తాను అధికారంలో లేనని.. తాను ఉంది ఉంటె పోలవరం పూర్తి అయిపోయి రాయలసీమ సస్యశామలం అయ్యి ఉండేదని, తన జీవితాశయం నెరవేరి ఉండేదని పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల్లో దుర్మార్గుడు అధికారంలోకి వచ్చి.. ఇష్టానుసారంగా చేసాడని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు.

నమ్మించి ప్రజల గొంతుకోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క కంపెనీ అయినా కడపలో వచ్చిందా అని ప్రశ్నించారు. తాను రాయలసీమ బిడ్డని అని.. రాయల సీమలోనే పుట్టానని పేర్కొన్నారు. ఇక తాను అధికారంలోకి వస్తే రాయల సీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. కులమతాలు చూడ కుండా రాష్ట్రాభివృద్ధి కోసం నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రజలకు అయన పిలుపునిచ్చారు.

Read More..

AP Politics: రాగ ద్వేషాలకు అతీతంగా పని చేసిన ప్రభుత్వం ఇదే..సీఎం జగన్

Next Story

Most Viewed