ఏపీకి వచ్చిన మోడీ.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఏపీకి వచ్చిన మోడీ.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో ఉమ్మడి సభ నిర్వహించాయి. ప్రజా గళం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. టీడీపీ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు మోడీ రాక ఊరటనిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఏపీకి అండగా ఉంటానంటూ మోడీ వచ్చారని తెలిపారు. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మొదలుపెడుతున్నామని చెప్పారు. 2014 కన్నా అధిక మెజార్టీతో విజయం సాధిస్తామని పవన్ జోస్యం చెప్పారు.

Read More..

రేర్ సీన్.. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, బాబు, పవన్

Next Story

Most Viewed