రేర్ సీన్.. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, బాబు, పవన్

by Disha Web Desk 19 |
రేర్ సీన్.. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, బాబు, పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ-జనసేన-బీజేపీల కూటమి స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో ఈ మూడు పార్టీలు ప్రజా గళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. ఈ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీ.. చిలకలూరిపేట ప్రజాగళం వేదిక సభాప్రాంగణంపైకి చేరుకున్నారు. టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి వేదికపై కూర్చున్నారు. దీంతో పదేళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. చివరగా ఈ ముగ్గురు 2014లో ఏపీలో ఎన్డీఏ కూటమి విజయోత్స సభలో ఒకే వేదికపై కనిపించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బాబు ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చారు. 2024లో మరోసారి ఈ మూడు పార్టీలు మరోసారి జతకట్టాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి బాబు, మోడీ, పవన్ ఒకే వేదికను పంచుకున్నారు. వైసీపీ ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగింది. దీంతో వైసీపీపై ప్రధాని మోడీ విమర్శల ఎక్కు పెడతారా లేదా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More..

చిలకలూరిపేట ప్రజాగళం సభకు చేరుకున్న ప్రధాని మోడీ

Next Story

Most Viewed