దృష్టి పెట్టాం.. పరిశీలిస్తాం: లోకేష్‌కు కేంబ్రిడ్జి వర్సిటీ వీసీ హామీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-22 10:32:30  IST  )

యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్ తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు...

దృష్టి పెట్టాం.. పరిశీలిస్తాం: లోకేష్‌కు  కేంబ్రిడ్జి వర్సిటీ వీసీ హామీ
X

దిశ, దావోస్ (స్విట్జర్లాండ్): ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్ తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8-10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్ నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్ లైన్ కోర్సులను ప్రారంభించండని ఆయన కోరారు. ‘‘ఏపీలోని యూనివర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చి, కరిక్యులమ్ డెవలప్ మెంట్, ఫ్యాకల్టీ ఎక్స్ చేంజీలపై నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపండి. సౌతాంప్టన్ – కేంబ్రిడ్జి మోడల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు డెడికేటెడ్ స్కాలర్ షిప్ లు, ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్ల ద్వారా ప్రోత్సాహం కల్పించండి. ఏఐ, డేటా సైన్స్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతికలపై జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల కోసం ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐటీ, తిరుపతి వంటి సంస్థలతో కేంబ్రిడ్జి వర్సిటీ కలిసి పని చేసే అంశాన్ని పరిశీలించండి. భారత్‌లో కేంబ్రిడ్జి విద్యాసంస్కరణలకు అనుగుణంగా ఏపీ విశ్వవిద్యాలయాల కోసం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, అధునాతన బోధనా పద్ధతులపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి.’’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

కేంబ్రిడ్జి వీసీ కీలక హామీ


కేంబ్రిడ్జి వైస్ ఛాన్సలర్ డెబ్బీ ప్రెంటిస్ స్పందిస్తూ భారత్‌లో సీఐఆర్ఎఫ్ ద్వారా తాము క్లైమెట్ ఎడ్యుకేషన్, బోధనా పద్ధతులు, డిజిటల్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్‌పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

Read More... స్విట్జర్లాండ్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Next Story