ప్రజల్లోకి పవన్ ... షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 16 |
ప్రజల్లోకి పవన్ ... షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు. ఇక్కడి నుంచి ప్రారంభించి మొత్తం 10 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. వారాహి విజయభేరి పేరుతో శనివారం చేబ్రోలులో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఏప్రిల్ 3న, తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం,12న రాజానగరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. దీంతో ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఏం విమర్శలు చేస్తారోననే ఉత్కంఠ అధికార పార్టీ నేతల్లో ఉంది.

కాగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. మే 13న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు వేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ సైతం శనివారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Read More..

జనసేనా పార్టీలో చేరనున్న అనసూయ..! క్లారిటీ ఇచ్చిన యాంకరమ్మ


Next Story