నేను శపిస్తే సర్వనాశనం అవుతారంటూ.. మీడియా పై కేఏ పాల్ ఫైర్

by Disha Web Desk 12 |
నేను శపిస్తే సర్వనాశనం అవుతారంటూ.. మీడియా పై కేఏ పాల్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ తెలుగు మీడియాపై ఫైర్ అయ్యారు. తాను ప్రజాశాంతి పార్టీతో దేశం కోసం, రాష్ట్రం కోసం వచ్చానని, తనకు మీడియా కవరేజ్ వస్తలేదు, తాను మీ కులం లో పుట్టకపోవడం మే ఇందుకు కారణమా అంటూ ప్రశ్నించారు. అలాగే మీడియా చానెల్స్ ప్రజలకు న్యాయం చేయకపోతే తాను శపిస్తాను.. అందరు సర్వనాశనం అవుతారని కేఏ పాల్ హెచ్చరించారు. అలాగే మూడు సంవత్సరాలుగా కనీస ఓటు బ్యాంకు లేని షర్మిల కు ఏ విధంగా లైవ్ కవరేజ్ ఎలా ఇస్తారని, బ్యానర్ ఐటమ్స్ ఎలా పెడతారని, అప్పుడు తెలంగాణలో.. ఇప్పుడు ఏపీలో ఆమెకు ఎలా కవరేజ్ ఇస్తారని ప్రశ్నించారు. అలాగే తాను మీడియా చానళ్ల ఓనర్లను వెంటాడుతానని, భారీ డబ్బు ఎలా సంపాదించారో పిల్ వేసి అందరి అంతు చూస్తానని కేఎ పాల్ మీడియా చానళ్ల ఓనర్లను హెచ్చరించారు.

Read More..

అవసరమైతే జనసేన నుంచి పోటీ చేస్తా.. మహిళా నేత ప్రకటన

Next Story

Most Viewed