అవసరమైతే జనసేన నుంచి పోటీ చేస్తా.. మహిళా నేత ప్రకటన

by Disha Web Desk 2 |
అవసరమైతే జనసేన నుంచి పోటీ చేస్తా.. మహిళా నేత ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ తొలి జాబితా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. టికెట్ ఆశించిన పసుపు పార్టీ నేతలంతా ఒక్కసారిగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా.. తిరుపతిలో టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయించడం, జనసేన ఆరణి శ్రీనివాసులుకు కేటాయిండంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో ఇరు పార్టీల అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. ఆరణికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. స్థానిక అభ్యర్థికి ఇవ్వాలని అన్నారు. ఇక్కడి జనసేన నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. అవసరమైతే తానే జనసేన నుంచి పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

Read More..

AP Political News: ఆంధ్రాలో ఎన్నికల కోడ్.. ఆ అంశంలో చంద్రబాబు అలెర్ట్..

Next Story

Most Viewed