ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో పథకం అమలు..

by Kodari Anjali |   (  Updated:2023-04-20 14:40:44  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ మరో తీపికబురు అందించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో పథకం అమలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ మరో తీపికబురు అందించారు. ఆరోగ్య చికిత్సలకు అవసరమయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే వహిస్తుందని, సర్కారు ఉద్యోగులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే..‘‘ఈహెచ్‌ఎస్’’ అనే పథకం ద్వారా వారికి ఫ్రీగా చికిత్స పొందవచ్చని తెలిపారు. అలాగే క్యాన్సర్‌కు సంబంధించిన 46 చికిత్సలను ప్రతి సంవత్సరం రెన్యవల్ చేస్తానన్నారు. కాగా.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా 46 క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి రెన్యవల్ చేసేలా సర్కారు ఆమోదించి వైద్యారోగ్య శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి : జగన్ విశాఖ జపం.. పట్టించుకోని జనం !

Next Story