- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎంపీ ఆదాలను కూడా టీడీపీలోకి ఆహ్వానించాం.. మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో :నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేరాలని గౌరవంగా ఆహ్వానించామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారని అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించలేదని చివరి నిమిషం వరకు ఆయన నిర్ణయం ప్రకటించరని అన్నారు.
చివరి వరకు వేచి చూసిన అనంతరం వస్తారనే తాము అనుకుంటున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఇక రేపోమాపో పార్టీలో చేరతారనుకుంటుండగా అకస్మాత్తుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.
Read more : వైసీపీని వీడే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై నెల్లూరు ఎంపీ ఆదాల స్పష్టీకరణ