Nukalamma Jathara: జాతరలో కొట్లాట... ఒకరు మృతి

by Disha Web Desk 16 |
Nukalamma Jathara: జాతరలో కొట్లాట... ఒకరు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి (మం) శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వ్యక్తి నడింపల్లి రాముగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి : Ugadi: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed