జనసేన ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రస్థాయి వేడుకలు రద్దు చేసిన పవన్ కల్యాణ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-10 06:43:25  IST  )

పిఠాపురంలో నిర్వహించి తలపెట్టిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రస్థాయి వేడుకలు రద్దు చేసిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వ పార్టీల్లో ఒకటైన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. మార్చి 14వ తేదీకి జనసేన పార్టీ ఆవిర్భావమై 12 వసంతాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పవన్ కల్యాణ్ ఆంక్షలు విధించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రాలు, నగరాలు, మండలాలు, పంచాయతీల్లో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడే వేడుకలు జరుపుకునేలా చూడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

తొలుత పిఠాపురంలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని రిపోర్టులు చెప్పడంతో.. వేడుకల నిర్వహణను మార్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని జిల్లా, సిటీ, మండల కేంద్రాల్లో నిర్వహించుకోవాలని పవన్ సూచించారు. స్థానికంగానే వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచత్చారు. వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమి సభ్యత్వం పొందినవారి సమక్షంలో ఎగురవేస్తారని తెలిపారు. సైద్ధాంతిక బలంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంతో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించాలని పవన్ పేర్కొన్నారు.

హరీష్ శంకర్ మ్యాజిక్ రిపీట్.. పవర్ స్టార్ పవర్‌ఫుల్ పోస్టర్‌తో పెరుగుతున్న అంచనాలు!


Next Story