బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నోట.. బడ్జెట్ మాట

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-15 12:12:27  IST  )

రాష్ట్ర బడ్జెట్ ‘వికసిత్ ఏపీ’ ద్వారా ‘వికసిత్ భారత్’నిర్మాణానికి పునాది వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు...

బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నోట.. బడ్జెట్ మాట
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర బడ్జెట్ ‘వికసిత్ ఏపీ’(Vikasith AP) ద్వారా ‘వికసిత్ భారత్’(Vikasith Bharat) నిర్మాణానికి పునాది వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Bjp State Chief Madhav) అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై మాధవ్ స్పందించారు. రాష్ట్రంలో 1.86 శాతానికి రెవెన్యూ లోటును పరిమితం చేశారని, ఇది ఆర్థిక క్రమ శిక్షణకు నిదర్శమని ఆయన కొనియాడారు. అంతేకాదు 3.32 లక్షల కోట్ల బడ్జెట్ అంటే సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. ఈ బడ్జెట్‌ను సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారని మాధవ్ తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ.. రైతులు, నిరుద్యోగుల ప్రస్తావనే లేదు : సీపీఎం యద్దేవా

Next Story