సుప్రీంలో సాక్షికి ఎదురుదెబ్బ.. అక్కడే తేల్చుకోమన్న ధర్మాసనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-02 08:18:42  IST  )

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కు చెందిన సాక్షిటీవీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది.

సుప్రీంలో సాక్షికి ఎదురుదెబ్బ.. అక్కడే తేల్చుకోమన్న ధర్మాసనం
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కు చెందిన సాక్షిటీవీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఫైబర్ నెట్ లో సాక్షిటీవీ ప్రసారాలు ఆపేశారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశాన్ని టీడీ శాట్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. కాగా.. గతంలోనూ సాక్షిటీవీ ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఆశ్రయించగా.. ఏపీ ఫైబర్ నెట్ సహా పలు ఎంఎస్ఓలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందని సాక్షి వాపోయింది.

హింస, విధ్వంసం, అవినీతి పునాదులతో పుట్టింది వైసీపీ...అలా చేస్తే వాళ్లకీ మనకీ తేడా లేదు..పార్టీ ముఖ్యనేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Next Story