యూపీకి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-27 13:50:59  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ఉత్తరప్రదేశ్‌‌లో పర్యటించనున్నారు. ..

యూపీకి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఆదివారం ఉత్తరప్రదేశ్‌‌(Uttara Pradesh)లో పర్యటించనున్నారు. రామ జన్మభూమి(Rama birthplace)లో శ్రీరాముడి(Lord Rama)ని దర్శించుకోనునున్నారు. అనంతరం యూపీ నుంచి ఉండవల్లికి చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్ చేశారు.

హైదరాబాద్‌లో చంద్రబాబు


అయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. హిమాయత్ నగర్‌లో జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు ఏపీ నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ శనివారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం చంద్రబాబు ఉండనున్నారు. ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి యూపీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Read More..

సీఎం రేవంత్‌తో రాహుల్, సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం

Next Story