గీతాంజలి మృతి.. YS షర్మిలపై నటి పూనమ్ సంచలన ట్వీట్

by Disha Web Desk 19 |
గీతాంజలి మృతి.. YS షర్మిలపై నటి పూనమ్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య ఏపీ రాజీకీయాల్లో సంచలనంగా మారింది. గీతాంజలి ఆత్మహత్యకు కారణం మీరంటే మీరే అని అధికార టీడీపీ, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించుకుంటున్నాయి. టీడీపీ నేతల ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తుండగా.. ఎన్నికలకు ముందు అనవాయితీలో భాగంగానే వైసీపీ గీతాంజలిని హత్య చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గీతాంజలి మృతిపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. గీతాంజలి ఆత్మహత్యకు కారణం ఎవరు..? ఒక పార్టీకి చెందిన ట్రోలర్సా లేదా మరేవరైనా ఉన్నారా అనేది అయోమయంగా ఉందన్నారు.

గీతాంజలి మరణానికి కారణమైనవారిని గుర్తించి.. నిందితులు ఎవరైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలి చిన్న పిల్లలకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంచలనంగా గీతాంజలి ఆత్మహత్యపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించకపోవడంపై తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ఘటనపై షర్మిల మౌనంగా ఉండటమేంటని పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. స్త్రీ నాయకత్వాన్ని మొదటి లక్షణం పిల్లలు, మహిళల పట్ల కనికరంగా ఉండటమని హితవు పలికారు. గీతాంజలి మరణానికి కారణమైన వారికి తెనాలిలోని మహిళలు, బాలికలు రోడ్లపైకి వచ్చి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాగా, గీతాంజలి మృతికి వైసీపీ ప్రభుత్వం రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More..

ఎన్నికల వేళ సెంటిమెంట్ నినాదం.. చంద్రబాబు నోట కీలక ప్రకటన

16న సీఎం జగన్ పర్యటన..అక్కడే అభ్యర్థుల తుది జాబితా రిలీజ్

Next Story

Most Viewed