- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెనాలి చెంచుపేటలో ఘోరం.. వ్యక్తి దారుణ హత్య
సంఘటనతో స్థానికంగా కలకలం.

దిశ, వెబ్ డెస్క్ : తెనాలిలోని చెంచుపేటలో (Tenali Chenchupeta) ఘోరం జరిగింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు (Murder) గురైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం షేక్ ఫయాజ్ (50) ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు అతడిని మట్టుబెట్టారు. కర్రలు, రాడ్లతో కొట్టడంతో ఫయాజ్ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఉన్న వారికి సమాచారం కోసం విచారించారు. తద్వారా ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గత ఏడాది అక్టోబరు నెలలో కూడా ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమర్తులూరు మండలంలోని కోడితాడిపర్రు గ్రామానికి చెందిన బుజ్జిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో బుజ్జి అక్కడికక్కడే మృతి చెందాడు. వరుస హత్యలతో తెనాలి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
READ MORE .....






