భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

by  |
corona virus
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 16,488 మంది కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో 12,771 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 113 మంది మృతి చెందారు.

దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కి చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా బారిన పడి 1,56,938 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,59,590 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,07,63,451 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా 21,54,35,383 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 1,42,42,547 మంది టీకా తీసుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు

Next Story

Most Viewed