రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు

by  |
రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 148 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,631కి చేరింది. ఇప్పటివరకు 1,633 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 1,939 కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,95,059 మంది కోలుకున్నట్లు డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,59,666 మంది కరోనా పరీక్షలు నిర్శహించినట్లు వెల్లడించింది.

Next Story

Most Viewed