భారత్‌లో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

by  |
India corona cases
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 13,193 కరోనా పాజటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గురువారం ఒక్కరోజే 97 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394 కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,56,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా 1,39,542 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,06,67,741 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 1,01,88,007 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించింది.

తెలంగాణలో తాజాగా 165 కరోనా కేసులు

Next Story