వలస కూలీకి రూ.10 వేలు ఇవ్వండి: మమతా బెనర్జీ

by  |
వలస కూలీకి రూ.10 వేలు ఇవ్వండి: మమతా బెనర్జీ
X

కోల్‌కతా: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు పీఎం కేర్ ఫండ్స్ నుంచి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు మమత ట్వీట్ చేస్తూ.. ‘కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావునా, అసంఘటిత, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల చొప్పున సాయం చేయాలి. ఇందుకోసం పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులను ఉపయోగించవచ్చు’ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed