ఏప్రిల్‌లో మహేష్ షూటింగ్ షురూ!

by  |
ఏప్రిల్‌లో మహేష్ షూటింగ్ షురూ!
X

సూపర్ స్టార్ మహేష్‌బాబు.. సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేష్ సినిమా సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మహేష్ తర్వాతి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే.
‘మహర్షి’ సినిమా హిట్ కాంబినేషన్ మరో‌సారి రిపీట్ కాబోతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. డిసెంబర్ రెండో వారానికి షూటింగ్ పూర్తి చేసుకుని, 2021, జనవరి 13లో సినిమాను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. అంటే, మహేష్ మళ్లీ సంక్రాంతి బరిలో నిలవనున్నారు అన్న మాట. కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపికైన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.
‘బాషా’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ టూ షేడ్స్ లో కనిపించినట్లుగానే.. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఉంటుందని సమాచారం. గ్యాంగ్ స్టర్‌గా, లెక్చరర్‌గా కనిపించనున్న మహేష్‌కు ఈ సినిమా తన కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. కాగా సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్‌‌శెట్టిని ఎంపిక చేసే అవకాశం ఉందట.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed