విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఉండొద్దు

by  |

దిశ, ఖ‌మ్మం: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మధిరలో విద్యుత్ సమస్యలపై ఆ శాఖ అధికారులతో బుధ‌వారం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ..మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు.రానున్న రోజుల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, స్తంభాలు ఏర్పాటు చేయాల్సిన చోట వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసి వర్షాకాలంలో సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఏ, ఏఈలు, ఎంపీపీ లలిత, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత పాల్గొన్నారు.



Next Story