జోన్లలో అలెర్ట్

by  |
జోన్లలో అలెర్ట్
X

దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నుంచి 24 వార్డు వరకు రెడ్ జోన్లుగా ప్రకటించామని జహీరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు తెలిపారు . జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీసు , మున్సిపల్ , వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు . మున్సిపల్ పరిధిలోని ” గడి ” బస్తీలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు . పారిశుద్ధ్య పనులకు మూడు బృందాలు ఏర్పాటు చేశామన్నారు . వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి , నివేదిక ఇవ్వాలన్నారు . కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ దవాఖానకు తరలించామన్నారు . రెడ్ జోన్ వార్డులోని ప్రజలు బయటకు రావద్దని సమాచారం ఇస్తే నిత్య వసర వస్తువులు పంపిస్తామన్నారు . అనంతరం డిఎస్పి గణపతి జాదవ్ మాట్లాడుతూ . . . లాక్ డౌన్ ముగిసే వరకు ప్రజలు ఎవరు బయటకు రావొద్దు అన్నారు . మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు . సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి , జహీరాబాద్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో శంకర్ , మునిసిపల్ సిబ్బంది , వైద్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .

Tags: containment zones, red alert, rto ramesh, sangareddy, carona, lockdown

Next Story

Most Viewed