'జాంబీ రెడ్డి' డబ్బింగ్ మోడ్

by  |
జాంబీ రెడ్డి డబ్బింగ్ మోడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ‘జాంబీ రెడ్డి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఆనంది, దక్షా నగర్కర్ హీరోయిన్లు కాగా.. చిత్రీకరణ పూర్తైనట్లు తెలిపింది మూవీ యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా.. డబ్బింగ్ మోడ్‌లో ఉంది టీం. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర వర్మ నిర్మిస్తున్న తొలి తెలుగు జాంబీ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

కాగా ఈ చిత్రంలో తేజ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్‌గా కనిపించనుండగా.. అమ్మవారి రూపంలో దసరాకు రిలీజైన ఆనంది లుక్ అదిరిపోయింది. ఇక దీపావళికి రిలీజైన దక్షా నగర్కర్ ఫస్ట్ లుక్ పబ్జి గర్ల్‌ను తలపిస్తుండగా.. ఈ చిత్రం కరోనా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ‘అ!’, ‘గరుడవేగ’ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి’తో హ్యాట్రిక్ కొట్టేస్తాడనే అంటున్నారు సినీ విశ్లేషకులు.



Next Story

Most Viewed