థియేటర్స్‌కు వచ్చేస్తున్న ‘జాంబీ రెడ్డి’.. డేట్ ఫిక్స్

by  |
థియేటర్స్‌కు వచ్చేస్తున్న ‘జాంబీ రెడ్డి’.. డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఫస్ట్ జాంబి మూవీ ‘జాంబీ రెడ్డి’ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారు. తేజ సజ్జ, ఆనంది, దక్ష ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమా ఫిబ్రవరి 5న విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ఆపిల్ ట్రీ ఫిల్మ్స్ రూపొందించిన మూవీ ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేయగా.. సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోతున్నందుకు గల కారణాలను వెల్లడించారు డైరెక్టర్. డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి, వారి సలహాలు తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రవితేజ ‘క్రాక్’ సూపర్ సక్సెస్‌పై మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. సంక్రాంతికి విడుదల కానున్న ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


Next Story