భయపెట్టిన ‘జాంబి రెడ్డి’ ఫస్ట్ బైట్..

by  |
భయపెట్టిన ‘జాంబి రెడ్డి’ ఫస్ట్ బైట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : మొట్టమొదటి తెలుగు జాంబి ఫిల్మ్ ‘జాంబి రెడ్డి’ టీజర్ అదిరిపోయింది. ‘అ!’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న మూడో చిత్రం ‘జాంబి రెడ్డి’ టీజర్‌తో భయపెట్టింది. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో తేజ సజ్జ, ఆనంది, దక్షా నగర్కర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఒకే నిమిషం నిడివి గల టీజర్‌ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.

‘దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధాశక్తి తనకే ఒక ప్రశ్నగా నిలిస్తే.. దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం’ అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభంలోనే హెచ్చరించగా.. ఆ తర్వాత వచ్చిన సీన్స్ ప్రేక్షకులను భయపెట్టాయి. చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందిన సినిమా హాలీవుడ్ సినిమాను తలపిస్తుండగా.. ప్రశాంత్ వర్మ మేకింగ్, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ బీజీఎంకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సినిమా పవర్‌ ఏంటో.. ప్రశాంత్ వర్మ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చూపించబోతున్నారని ప్రశంసిస్తున్నారు. జాంబి రెడ్డి ఫస్ట్ బైట్‌తో ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించిన డైరెక్టర్.. ఖచ్చితంగా అదిరిపోయే హిట్ అందుకుంటారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.



Next Story