తేజ్‌తో జీ స్టూడియోస్ అసోసియేషన్

by Shyam |
తేజ్‌తో జీ స్టూడియోస్ అసోసియేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో అసోసియేట్ అయినట్లు ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్. సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు రైట్స్ పొందిన జీ స్టూడియోస్.. డిశంబర్ 2020లో చిత్రం థియేటర్‌లో విడుదల కాబోతున్నట్లు నోట్ రిలీజ్ చేసింది. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌‌కు పుష్కలమైన ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని.. వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుందని తెలిపింది.

కాగా తమ అసోసియేషన్‌తో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో తేజ్ సంతోషంగా ఉన్నారన్న జీ స్టూడియోస్ .. ఇంతకు ముందు తెలుగు సినిమాల నిర్మాణంతో హిట్ అందుకున్న తాము మరో ఎంటర్టైన్మెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది. తేజ్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. డిశంబర్‌లో విడుదల కానున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed