హుజూర్‌నగర్‌లో జబర్దస్త్ కమెడియన్ సందడి

by  |
Kirak RP
X

దిశ, హుజూర్‌నగర్: సామాజిక సేవతోనే మానసిక సంతృప్తి ఉందని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట రఘు అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని మల్లన్న నగర్ లో జబర్దస్త్ షో ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీతో కలిసి దుర్గామాత శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సద్దుల బతుకమ్మలో పాల్గొన్న మహిళలకు ఫౌండేషన్ నుండి బహుమతులు అందజేశారు. కమిటీ సభ్యులు, కౌన్సిలర్ జక్కుల శంభయ్యలు రఘు, ఆర్పీలను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఫౌండేషన్ చైర్మన్ రఘు మాట్లాడుతూ.. సామాజిక‌ కార్యక్రమాల ద్వారా కలిగే అనుభూతి అనిర్వచనీయం అన్నారు. ఇప్పటికే ఫౌండేషన్ తరఫున వినాయక, దుర్గామాతల విగ్రహాలను నియోజకవర్గంలో వందల సంఖ్యలో పంపిణీ చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కనకదుర్గ ఉత్సవ కమిటీ, మల్లన్న నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed