ఆలయాలపై దాడుల వెనుక చంద్రబాబు హస్తం : వైవీ సుబ్బారెడ్డి

by  |
ఆలయాలపై దాడుల వెనుక చంద్రబాబు హస్తం : వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, ఏపీబ్యూరో : రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు వెనుక చంద్రబాబునాయుడు హస్తం ఉందని టీటీడీ చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎక్కడ దాడులు జరుగుతున్నా ముందుగా చంద్రబాబునాయుడు, ఆయన బృందానికి ముందుగా తెలుస్తున్నాయంటే ఆయన ప్రమేయం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వరుస ఘటనలపై విచారణ జరుగుతున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

ఈపాటికే పోలీసు, ఇతర అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఓ మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడల్లా ఇలాంటి ఘటనలు చేసుకోవడం వెనుక ప్రతిపక్ష కుట్ర దాగున్నట్లు వైవీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకే ఇలాంటి దుష్ట పన్నాగాలకు చంద్రబాబు పాల్పడుతున్నట్లు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సొంతం చేసుకుంటుందని వైవీ ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed