కొంపముంచిన శ్రీలంక టూర్.. మరో ఇద్దరికి కరోనా

by  |
కొంపముంచిన శ్రీలంక టూర్.. మరో ఇద్దరికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా ఎట్టకేలకు వన్డే, టీ-20 సిరీస్‌లను ముగించుకున్న ఉన్న భారత జట్టును కరోనా కలవరపెడుతోంది. గత మూడ్రోజుల క్రితం ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా రావడంతో అతడితో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యూజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్, కే. గౌతమ్‌లు క్వారంటైన్‌కు వెళ్లారు. ఇదే సమయంలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. స్పిన్నర్‌ యూజువేంద్ర చాహల్, మరో బౌలర్ కే. గౌతమ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఉంటున్న హోటల్‌లోనే వారు చికిత్స తీసుకుంటున్నట్టు ఓ జాతీయ మీడియా ప్రచురించింది.


Next Story