ముందు సచిన్… తర్వాత యూసఫ్ పఠాన్

by  |
ముందు సచిన్… తర్వాత యూసఫ్ పఠాన్
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శనివారం రాత్రి కొవిడ్-19 టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపిన ఆయన… ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నానని చెప్పారు. తగిన జాగ్రత్తలతోపాటు కావాల్సిన మెడిసిన్ తీసుకుంటున్నట్టు తెలియజేశారు. తనతో ఇటీవల కాంటాక్ట్ అయినవారిని కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా సూచించారు.

కాగా సచిన్ టెండూల్కర్ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో వీరిద్దరూ కలిసి ఆడారు. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన ఇండియా లెజెండ్స్‌‌ టీమ్‌ కి కెప్టెన్‌గా సచిన్ సారధ్యం వహించారు. శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 36 బంతుల్లోనే 62 పరుగులు చేసి యూసఫ్ పఠాన్ తన సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శన కనబర్చి టీమ్ ని విజేతగా నిలిపాడు.


Next Story

Most Viewed