కేసీఆర్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో : షర్మిల

by  |
కేసీఆర్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో : షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ‘కేసీఆర్ ది నియంత పోకడ. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్ హుజురాబాద్ లో గెలవలేకపోయాడు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ గారడి మాటలు, పిట్ట కథలు నమ్మలేదు. హుజురాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు తీసుకొచ్చినా కేసీఆర్ ను ప్రజలు నమ్మలేదు. కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ వైఖరి మార్చుకో’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story

Most Viewed