ఇంకెంతమందిని చంపుతవ్ దొర.. కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

by  |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి ఇక్బాల్, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో నిరుద్యోగులు చనిపోతున్నా ఉద్యోగాలు కల్పించకుండా కేసీఆర్ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంత మందిని చంపుతావ్ కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతే వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అచ్చమైన ప‌ల్లె భాష‌తో అన్యాయంపై గొంతెత్తిన ప్రజాకవి, ప్రజల కోసం నిరంత‌రం ప‌రిత‌పించిన భాషాభిమాని అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


Next Story

Most Viewed