వైసీపీ తిరుపతి అభ్యర్థి ఎవరో తెలుసా?

by  |
వైసీపీ తిరుపతి అభ్యర్థి ఎవరో తెలుసా?
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఫిజియోతెరపిస్టు మద్దిల గురుమూర్తిని శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సీఎం జగన్​ ప్రజా సంకల్పయాత్రలో ఆయనకు ఫిజియోతెరపిస్టుగా గురుమూర్తి సేవలందించారు. అంతేకాదు. జగన్​సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రలోనూ గురుమూర్తి ఫిజియోతెరపిస్టుగా సేవ చేశారు. ప్రస్తుతం విజయవాడలోని శిశు సంక్షేమ శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం ఆయన సొంతూరు. తిరుపతి స్విమ్స్​లో బ్యాచిలర్​ఆఫ్​ఫిజియోతెరపీ చేశారు. 2008 నుంచి 2015 వరకు తిరుపతిలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫిజియోతెరపిస్టుగా పనిచేశారు. 2015 నుంచి 2019 వరకు తిరుపతిలోని ఆసరా రిహాబిలిటేషన్​ కేంద్రానికి ఎండీగా వ్యవహరించారు. తొలుత బల్లి దుర్గా ప్రసాదు భార్య లేదా కుమారుడు కల్యాణ చక్రవర్తికి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో సానుభూతి ఓట్లు పొందడం కష్టమని భావించిన పార్టీ అధిష్టానం సీఎం జగన్​సూచన మేరకు గురుమూర్తిని ఎంపిక చేసింది. దుర్గా ప్రసాదు కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీనిచ్చింది.



Next Story

Most Viewed