నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

by  |
నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేల కోటాలో ఆరు శాసన మండలి సభ్యత్వాల కోసం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు అందజేశారు. అహ్మద్ ఇక్బాల్‌, సి.రామ‌చంద్రయ్య, దువ్వాడ శ్రీ‌నివాస్‌, చ‌ల్లా భ‌గీర‌థ‌ రెడ్డి, క‌రీమున్నాసా, బ‌ల్లి క‌ల్యాణ‌ చ‌క్రవర్తిలు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థుల వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు. అంతకు ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వారికి జగన్ బీఫామ్స్ అందజేశారు. అనంతరం వారు నామినేషన్లు దాఖలు చేశారు.



Next Story

Most Viewed